8 మంది ఆచూకీ గల్లంతైతే.. రేవంత్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమా? :కేటీఆర్

-

ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ సమయంలో టన్నెల్ వద్దకు రాకుండా, పరిస్థితిని సమీక్షించకుండా సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల బిజీలో నిమగ్నమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతది ??

ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ..ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా ?

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ?
ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి !!! సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా ?

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడ్తారు’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news