లోకేష్ తలపై రూపాయి పెడితే పావలకు పనికిరాడు – మంత్రి కాకాని

-

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు పర్యటనలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తలపై రూపాయి పెడితే పావలాకు పనికిరాడని విమర్శించారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇలా స్థాయి తగ్గి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు.

లోకేష్ తాత ఖర్జూర నాయుడు రైతుల పొలాల్లో రాత్రులు వేరుశనగ బస్తాలు ఎత్తుకెళ్లేవాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ లు అఖిలభారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. ఇలాంటి అవాకులు, చవాకులు పేలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మంత్రి కాకాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version