లోకేశ్ షేర్ చేసిన వీడియోలో.. ఇంత అరాచకమా..!

-

ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ రోజు అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ ఇంటిపై జరిగిన దాడి వీడియోని షేర్ చేస్తూ అస్త్రాలు సంధించారు. రామచంద్ర రెడ్డి మనుషులు జర్నలిస్ట్ వెంకట నారాయణను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇంటికి గుండాలను పంపించి కుటుంబ సభ్యుల మీద దాడి చేయించారు అని నారా లోకేష్ విమర్శించారు. చెప్పినట్టు వినకపోతే అందరిని చంపేస్తామంటూ బెదిరించడం అనాగరికమని అన్నారు.

మలయాళీల ఘనమైన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక ఓనం పండుగని టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మలయాళీలందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మలయాళీ ఇంట ఆనంద సిరులు శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇంటికి సిరుల పంట వచ్చే తరుణంలో… ఎంతో కళాత్మకంగా, వైభవంగా, ఆనందంతో జరుపుకునే ఓనం పండుగని లోకేశ్ అన్నారు. ఈ పండుగ ఇంటిల్లి పాదికీ శుభాలను, సంతోషాలను ఏడాది పొడుగునా అందివ్వాలని లోకేశ్ కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version