ఉత్తర్‌‌ప్రదేశ్‌లో అత్తర్ వ్యాపారుల ఇళ్లపై ఐటీ దాడులు

-

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అత్తర వ్యాపారులపై ఆదాయపు పన్నుశాఖ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం కనౌజ్‌లో అత్తర్ వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్‌‌తోపాటు మరికొందరు అత్తర్‌ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు.

పన్ను ఎగేవతకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం మేరకు ముంబయి, న్యూఢిల్లీ, ఇతర ప్రాంతాలతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని 50 చోట్ల ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అత్తర్ వ్యాపారంతో సంబంధం ఉన్న వారే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.

సమాజ్‌‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ పంపి. 2022, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ సమక్షంలో సమాజ్‌‌వాదీ ఇత్ర లేదా అత్తర్‌ను పుష్పరాజ్ జైన్ మార్కెట్‌‌లోకి తీసుకువచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version