తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఎల్లుండి నుంచి అమల్లోకి

-

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరగనున్నాయి. భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్వర్వుల ప్రకారం… ఎల్లుండి నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో….సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జనాలు పోటెత్తుతున్నారు. కాగా… ఇటీవలె జరిగిన తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో భూముల ధరలు పెంచాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్‌.  దీంతో  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగనున్నాయి. అలాగే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్‌ విలువుల కూడా పెరగనున్నాయి. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు స్పష్టం కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version