IND vs ENG: విరాట్ కోహ్లి రికార్డును జైస్వాల్ బ్రేక్ చేస్తాడా…..?

-

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నారు.వరుస డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం జైస్వాల్‌ మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్లో అర్ధ సెంచరీ చేసిన ఇతడు.. సెకండ్ & థర్డ్ టెస్టులో డబుల్ సెంచరీలతో చెలరేగారు. తాజాగా 4వ టెస్టులో ఇప్పటికే అర్ధ సెంచరీ బాదారు. ఇదే ఊపులో ఇంగ్లండ్ పై ఓ టెస్టు సిరీస్లో అత్యధికముగా 600లకు పైగా రన్స్ చేసిన 2 వ ఇండియా ఆటగాడిగా నిలిచాడు.కోహ్లి 655 రన్స్తో నంబర్ 1 స్థానంలో ఉన్నారు.

గతేడాది వెస్టిండీస్‌ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్….కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 618 రన్స్ (తొలి టెస్టులో 80, 15; రెండో టెస్టులో 209, 17; మూడో టెస్టులో 10, 214; నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73) చేశాడు.ఇక, టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ 1930లో ఒక సిరీస్‌లో ఐదు టెస్టుల్లో అతడు ఏకంగా 974 రన్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news