ఇండియా కరోనా అప్డేట్..186రోజుల్లో తక్కువ సంఖ్యలో..!

-

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు దేశం లో 26,964 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మొత్తం 34,167 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశం లో 383 మంది కరోనా తో మరణించారు.

ఇక తాజాగా దేశం లో నమోదైన కేసులతో 3,01,989 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. అయితే 186 రోజుల్లో మొదటి సారిగా తక్కువ సంఖ్యలో యాక్టిివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 82కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్ లు తీసుకున్నారు. గ్రామ గ్రామాన స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి వ్యాక్సిన్ లు ఇవ్వటం వల్లే వ్యాక్సిన్ ప్రకియ వేగంగా జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version