ఇండియాలో కొత్తగా 2841 కరోనా కేసులు, 9 మరణాలు

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2841 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,16,254 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3295 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.78 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 09 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,190 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 18,604 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,99,44,803 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14,03,220 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,73,460 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version