బీసీసీఐ కీలక నిర్ణయం.. లతామంగేష్కర్ మరణానికి సంతాపంగా నల్ల రిబ్బన్లతో భారత ఆటగాళ్లు

-

లతా మంగేష్కర్ మరణం యావత్ దేశానికి తీరని లోటు మిగిల్చింది. అందరూ తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని దగ్గర నుంచి సినీలోకం ఆ మధుర గాయనికి నివాళులు అర్పిస్తోంది. తాజాగా బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరగబోయే ఇండియా – వెస్టిండీస్ మ్యాచ్ లో నల్ల రిబ్బన్లతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. లతా మంగేష్కర్ కు గౌరవార్థం భారత్ & వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించి ఆడుతారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో వెస్టిండీస్, భారత్ మధ్య తొలి వన్డే జరుగనుంది.

కరోనాతో ఈరోజు భారతరత్న, పద్మవిభూషన్ లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 28 రోజుల పాటు చికిత్స పొందుతున్న తరుణంలో నిన్ని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఈ రోజు ఉదయం మరణించారు. ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version