బిగ్ బ్రేకింగ్ :  భారత దేశం లాక్ డౌన్ ?

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ను నియంత్రించడానికి దేశ ప్రజలంతా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో రాజస్థాన్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రం అయితే ఏకంగా ఈ నెల 22 నుండి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.  దేశంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. రాజస్థాన్ లో ఇప్పటికే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పది రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రం మొత్తం మూత పడుతుందని.. అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఇంటి నుండి ఎవరు బయటికి రాకూడదని జాతీయ రహదారులను అలాగే ప్రవేట్ ఆఫీసులు, షాపింగ్ మాల్స్ మరియు సినిమా థియేటర్లు మూసి వేస్తున్నట్లు కేవలం నిత్యవసర వస్తువులు దొరికే దుకాణాలు మరియు మెడికల్ షాపులు పాల వ్యాపారం మాత్రమే కొనసాగుతుందని తెలిపారు.

 

ఇదే బాటలో తాజాగా పుదుచ్చేరి కూడా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పుదుచ్చేరి సీఎం తెలిపారు. పాండిచ్చేరి రాష్ట్రం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లనుంది. మొత్తంమీద ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారతదేశం మొత్తం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తే గాని ఈ వైరస్ అరికట్టే మార్గం లేదని భావిస్తున్నారు రాజకీయ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version