WORLD CUP 2023:రికార్డు సృష్టించిన టీమ్ ఇండియా…!

-

ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా అన్ని విభాగాలలో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మొదటి స్థానంలో ఉంది. కాగా నిన్న బెంగుళూరు లో జరిగిన నెదర్లాండ్ తో మ్యాచ్ లో ఇండియా మొత్తం తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించడం విశేషం. ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో చాలా నమ్మకంగా ఇలా బౌలర్లను వాడడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని చెప్పాలి. మాములుగా అయితే ఇండియాకు ఈ వరల్డ్ కప్ లో బుమ్రా, షమీ, సిరాజ్, జడేజా మరియు కుల్దీప్ లు రెగ్యులర్ బౌలర్లు గా సేవలను అందిస్తున్నారు. కానీ నిన్నటి మ్యాచ్ లో ఇండియా వీరు మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్ మరియు సూర్య లను కూడా వాడడం విశేషం. ఈ విధంగా ఇండియా ఇంతమంది బౌలర్లను వాడడం 31 ఏళ్ళ తర్వాత వాడిందట.

ఈ విధంగా తొమ్మిది మంది బౌలర్లను ఇండియాలాగే ఇంగ్లాండ్ 1987 లో మరియు న్యూజిలాండ్ 1992 లో వాడినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కివీస్ మరియు ఇండియా ల మధ్యన మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version