ఒక్క‌రోజులోనే 75,995 క‌రోనా కేసులు

-

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత‌గా రెచ్చిపోతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే 75,995 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,307,749కు చేరుకుంది. గ‌త 24గంట‌ల్లో మ‌రణించిన వారి సంఖ్య 1017గా న‌మోదు అయింది. ఇప్ప‌ట‌వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 60,000కు చేరుకుంది. ఇక అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతున్న ఐదు రాష్ట్రాలు ఇలా ఉన్నాయి.. మ‌హారాష్ట్ర‌ (718,711), త‌మిళ‌నాడు (397,261), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (3,82,469), క‌ర్నాట‌(300,000), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(197,000) కేసులు న‌మోదు అయ్యాయి.

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసుల సంఖ్య 165,764కు చేరుకుంది. అలాగే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 24,315,420మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. 16,842,031మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. 828,721మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక అత్య‌ధికంగా అమెరికాలో 5,998,666కు కేసుల సంఖ్య చేరుకుంది. ఆ త‌ర్వాత బ్రెజిల్‌లో 3,722,004కు కేసులు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news