టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా

-

దక్షిణాఫ్రికా- టీమిండియా జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో మొదటగా టీమిండియాకు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని టీమిండియా సారథి రిషబ్ పంత్ వెల్లడించాడు. అటు, దక్షిణాఫ్రికా జట్టులో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ తిరిగి జట్టులోకి చేరాడు.

బౌలింగ్ ను బలోపేతం చేసేందుకు మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడీలను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. ఐదు మ్యాచ్ ల ఈ టీ20 సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-1తో ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ లో నెగ్గిన టీమిండియా… నేటి మ్యాచ్ లోనూ నెగ్గి సమం చేయాలని కోరుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version