ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా.. వరుణుడి ఎంట్రీ..

-

వర్షంకాలం క్రికెట్‌ మ్యాచ్‌లు అంటే.. ఆటగాళ్లు ఆడదానికంటే.. వరుణుడు ఆడుకునేదే ఎక్కువగా ఉంటుంది.. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌లు సైతం వరుణుడి ఎంట్రీతో నిలిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌కు దక్షిణాఫ్రికాకు మధ్య జరుగుతున్న 5మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి ఐదో మ్యాచ్. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్‌ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే.. మీరు కాసేపు ఆగండి నేనాడుతా అంటూ వచ్చేశాడు వరుణుడు.. దీంతో తాత్కాలికంగా ఇండియా-సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ తాత్కాలికంగా అంతరాయం కలిగింది. అయితే వరుణుడు ఆగకుండా ఆడుకుంటే మాత్రం ఈ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఉత్కంఠగా ెదురు చూస్తున్న మ్యాచ్‌కు ఇలా వర్షం అంతరాయం కలిగించడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version