ఉగ్రదాడిపై భారత్ తప్పక ప్రతీకారం తీర్చుకుంటుంది : ఎంపీ ఈటల

-

జమ్ము కాశ్మీర్‌లోని పహల్గంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో సుమారు 28 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్ముకాశ్మీర్‌లో టెర్రరిస్ట్ ఎటాక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ (@narendramodi) గారు చాటి చెప్పారు.

కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది.అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు.భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు.బాధితులు చిందించిన రక్తం వృథా పోదు.తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది’ అని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news