అంతర్జాతీయ స్థాయికి రైతు పోరాటం.. విదేశాంగశాఖ కీలక వ్యాఖ్యలు

-

ఢిల్లీ లోని రైతుల పోరాటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ ప్రారంభం అయింది. రిహానా బాటలో కమలా హ్యారిస్ మేన కోడలు మీనా హారిస్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. రైతులకు మద్దతుగా ఆమె ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఆమెకు తోడు అమెరికన్ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా ట్వీట్ చేసింది.

ఒకరకంగా ఇలా అంతర్జాతీయ వేదికల మీద చులక అవుతున్నామని భావించిన భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీల ట్వీట్లకు విదేశాంగశాఖ సమాధానం చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. కావాలని కొందరు బాధ్యతా రహిత ట్వీట్లు చేస్తున్నారన్న విదేశాంగశాఖ, ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు సంయమనంతో ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే ఈ అంశం మాత్రం ఇక్కడితో ఆగేలా మాత్రం కనిపించడం లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?

 

Read more RELATED
Recommended to you

Exit mobile version