ఖేర్సన్‌పై రష్యా ప్రతీకార దాడి.. 21 మంది పౌరులు మృతి

-

ఉక్రెయిన్​పై రష్యా ప్రతీకారం తీర్చుకుంది. మరోసారి దాడులకు తెగబడింది. ఇప్పట్లో ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. రెండు దేశాలూ పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి రష్యా అధ్యక్ష భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ పై క్రెమ్లిన్‌ సైన్యం విరుచుకుపడింది. నగరంపై బాంబుల వర్షం కురిపించింది.

ఓ సూపర్‌ మార్కెట్‌తోపాటు రైల్వే స్టేషన్‌పై మిస్సైల్‌తో దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ మీడియా వెల్లడించింది. ఈ ఉదయం కీవ్‌ లో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలిపింది.

రష్యా దాడులను తిప్పికొట్టేందుకు పోరాడుతున్నట్లు కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. రష్యా మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఈ మేరకు కీవ్‌ నగరంలో ఎయిర్‌ రైడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాజధానితో పాటు ఖేర్సన్, చెర్నిహివ్, సుమీ, పోల్టోవా, కిరోవోహ్రాద్, ఖార్కివ్, మికొలైవ్, ఒడెస్సా, ద్నిప్రొపెట్రోవ్స్క్, జపొరిజియా రీజియన్లలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version