రిపోర్ట‌ర్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన బ్రెజిల్ అధ్య‌క్షుడు..!

-

బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో ఓ రిపోర్ట‌ర్‌కు లైవ్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. రాజధాని బ్రెసీలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్ పర్యటనకు బోల్సొనారో వెళ్లారు. పర్యటనకు వెళ్లిన అధ్యక్షుడు బోల్సొనారో మీడియాతో పలు అంశాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అధ్యక్షుడి భార్య మిచెల్లి బోల్సోనారోపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. జూనియర్ బోల్సోనారో వ‌ద్ద‌ ప‌నిచేసిన ఓ వ్య‌క్తి అక్ర‌మంగా మిచెల్లి అకౌంట్‌లో భారీ న‌గ‌దు జ‌మా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే ఈ విషయంపై ఓ రిపోర్ట‌ర్‌ బోల్సోనారోను ప్రశ్నించాడు. దీంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ‘నీ మొహం మీద కొట్టాలని ఉంది నాకు’ అని కోప్పడ్డారు. ఈ వ్యాఖ్యల తరువాత ఇతర జర్నలిస్టుల నిరసన వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు జర్నలిస్ట్ గ్లోబో మాత్రం తాను వృత్తిధర్మాన్ని నిర్వర్తించానని, ఓ వార్తా పత్రిక ప్రతినిధిగా ప్రశ్నించడం తన పని అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version