కన్నీళ్లు పెట్టుకున్న నియంత కిమ్ జోంగ్ ఉన్.. వీడియో వైరల్

-

కర్కశత్వానికి బ్రాండ్ అంబాసిడర్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో మెదిలో మొదటి ఆలోచన ఇది. కఠిన ఆంక్షలతో.. నిరంకుశత్వంతో ఆ దేశ ప్రజలను తన గుప్పిట్లో ఉంచుకున్న నియంత. అంతటి కర్కశ మనసున్న కిమ్.. తాజాగా ఓ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఉత్తర కొరియా తల్లులకు విజ్ఞప్తి చేశారు.

ఉత్తర కొరియాలో గత కొన్నేళ్లుగా జననాల రేటు తీవ్రంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కిమ్.. దేశంలోని తల్లులతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వేదికగా ఆయన ఆ దేశ మహిళలను ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరారు. జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం తమ బాధ్యత అని.. అందుకే తమ సర్కార్ తల్లులతో కలిసి పనిచేయాలని భావిస్తోందని ఈ సందర్భంగా కిమ్ అన్నారు. అందుకే దేశంలోని మహిళలు ఎక్కువ మంది పిల్లలు కనాలని చెబుతూ కిమ్ కంటతడి పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. కఠిన మనసున్న కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త కొత్తగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version