నేటి నుంచే ఐపీఎల్‌ 16వ సీజన్‌.. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో చెన్నై ఢీ

-

వచ్చింది ఆ సమయం రానే వచ్చింది. క్రికెట్ వీక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. వేసవిలో అసలైన ఆనందం అందించేందుకు ఐపీఎల్ పండుగ రెడీ అయింది. ఇవాళ్టి నుంచే ఐపీఎల్ 16వ సీజన్ మొదలుకానుంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో తొలిసారే కెప్టెన్‌గా గుజరాత్‌కు టైటిల్‌ అందించిన హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.

మరోవైపు కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్న ధోని మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ధోనీ.. ధోనీ.. అనే నినాదాలతో మరోసారి క్రికెట్ స్టేడియం దద్దరిల్లడానికి రెడీ అవుతోంది. స్టోక్స్‌, డెవాన్‌ కాన్వె, రుతురాజ్‌, అంబటి రాయుడు, మొయిన్‌ అలీ, జడేజా, తీక్షణ, దీపక్‌ చాహర్‌ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రసారం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version