వాళ్ల మాటలతో బాధపడ్డా : జాన్వీకపూర్

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన భారీ అందాల తో కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే, తాజాగా ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గురించి నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఎంతో బాధించాయని హీరోయిన్ జాన్వి కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనం ఎంత కష్టపడినా, ఏదో ఒక తప్పు వెతికి ట్రోల్ చేస్తుంటారు. అలా వాళ్ళు ఆనందం పొందుతారు. వారి విమర్శలతో మనం వార్తల్లో నిలుస్తాం. ఇది ఎప్పటికీ జరుగుతుంది. నా కెరియర్ ఆరంభం నుంచి నెపోకిడ్ అనే విమర్శను ఎదుర్కొన్న’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version