మ‌రో దారుణం.. ఈ సారి న‌క్క‌ను బాంబు పెట్టి చంపారు..

-

స‌మాజంలో నిజంగా కొంద‌రు మ‌నుషులు మృగాల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మూగ‌జీవాల‌ను అతి దారుణంగా హింసిస్తున్నారు. కేర‌ళలో పైనాపిల్ పండ్ల‌లో బాంబుల‌ను పెట్టి కొంద‌రు ఓ ఏనుగును బ‌లి తీసుకోగా.. మ‌రో చోట ఆవుపై కొంద‌రు ఇలాగే దారుణానికి పాల్ప‌డ్డారు. ఇక ఆ రెండు ఘ‌ట‌న‌లు మ‌రిచిపోక‌ముందే త‌మిళ‌నాడులో కొంద‌రు ఓ న‌క్క‌ను ఇలాగే చంపారు.

త‌మిళ‌నాడులో ఓ న‌క్క నోట్లో బాంబు పేలి చ‌నిపోయింది. కొంద‌రు దాన్ని ప‌ట్టుకునేందుకు మాంసంలో బాంబు‌ను ఉంచి మాటు వేశారు. ఆ మాంసాన్ని తిన్న న‌క్క నోట్లో బాంబు పేలింది. దీంతో ఆ న‌క్క అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అనంత‌రం వారు దాని మృత‌దేహాన్ని సంచిలో వేసుకుని స‌మీపంలో ఉన్న ఓ టీ స్టాల్ వ‌ద్ద‌కు వ‌చ్చి టీ తాగ‌డం మొద‌లు పెట్టారు. అయితే వారి వ్య‌వ‌హారం అనుమానాస్ప‌దంగా క‌నిపించడంతో అటుగ వెళ్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ వారిని విచారించాడు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది.

త‌మిళ‌నాడులోని ట్రిచీలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోగా.. ఇందుకు కార‌ణమైన మొత్తం 12 మంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా వారు ఆ నక్క‌ను దాని దంతాలు, మాంసం కోసం చంపిన‌ట్లు అంగీక‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version