రేవంత్ రెడ్డి పై జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు..!

-

సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కైపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తో పాటుగా మోడీ కి రేవంత్ రెడ్డి డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపణలు చేశారు.

అందుకని రేవంత్ రెడ్డి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి దాడులు చేయట్లేదని అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసిన కోమటిరెడ్డి సోదరులు వేల కోట్లు ఎలా సంపాదించారని అడిగారు. ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం చెప్తున్నారు కానీ ఆగస్టులో రుణమాఫీ అంటే రైతులు ఎవరూ నమ్మరు అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version