కత్తి మహేష్ చికిత్సకు జగన్ సర్కార్ భారీ ఆర్థిక సాయం..

-

సినీ విమ‌ర్శకుడు, న‌టుడు అయిన క‌త్తి మ‌హేశ్‌కు చెన్నై-కలకత్తా రహదారిపై గత శ‌నివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయ‌న్ను పోలీసులు నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

అయితే..చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్‌కు జగన్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఏకంగా రూ. 17 లక్షలు మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ అయ్యాయి. ఆయనకు వైద్యం అందిస్తోన్న చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ఈ నిధులను బదలాయించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం హరికృష్ణ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను కూడా మంజూరు చేశారు. కాగా.. కత్తి మహేష్‌ పరిస్థితి ఇంకా క్రిటికల్‌ గానే ఉందని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version