పదవుల కక్కుర్తితో జగన్ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు – బోండా ఉమా

-

పదవులకు కక్కుర్తి తో జగన్ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు టిడిపి పోలీటి బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు. వ్యవస్థలని నాశనం చేసి అధికారకాంక్షలు చాటుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేయించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్హత ఇంటర్మీడియట్ అని చూపిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పట్టభద్రుల ఎన్నికలలో ఓటర్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు.

దొంగ ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్షాలతో సహా తొమ్మిది ఫిర్యాదులు చేసిన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బోండా ఉమా. తాడేపల్లి ఆదేశాలు పాటించి పనిచేస్తున్న అధికారులు, పోలీసులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోబోతున్నారని హెచ్చరించారు. జగన్ దెబ్బకు రాష్ట్రంలో 2000 నోటు చూద్దామన్నా కనిపించడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version