పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో కొనసాగుతుంది. అంగళ్లలో నారా లోకేష్ కి టిడిపి కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మరోసారి పెద్దిరెడ్డి కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాని గుప్పెట్లో పెట్టుకొని దోచుకోవడమే పెద్దిరెడ్డి కుటుంబం పని అని తీవ్ర విమర్శలు చేశారు.

మదనపల్లికి ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ సవాల్ విసిరారు నారా లోకేష్. “దమ్ముంటే రా రేపు నేను తంబళ్ళపల్లెలోనే ఉంటాను” అంటూ మిథున్ రెడ్డికి సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చ తాను రెడి అని.. మీలాగా నన్ను అరెస్టు చేయాద్దుని బెయిల్ తీసుకునే టైపు కాదన్నారు. నేను తప్పు చేయాను… అభివృద్ధి మాత్రమే చేస్తానన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ఆరు నెలలో మదనపల్లె ని జిల్లా చేసే బాద్యత ఈ నారా లోకేష్ దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version