కొరటాల సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్…

-

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని అనుకునేవారు లేకపోలేదు. ఫలానా ఫలానా హీరోల సరసన నటించడానికి అంగీకరించిందనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ, ఆమె కొరటాల సినిమాలో ఎన్టీఆర్ జోడీగా చేయనుందనే విషయమే ఖాయమైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవి ఎన్ని భాషల్లో నటించినా, ఆమె తెలుగు ప్రేక్షకుల సొంత మనిషి అన్నట్టుగానే అంతా భావిస్తారు .. ఆరాధిస్తారు.

అలాంటి శ్రీదేవి కూతురు ఎన్టీఆర్ జోడీగా ఒక సినిమా చేయనుందనే వార్త బయటికి రాగానే శ్రీదేవి అభిమానులంతా సంతోషంతో పొంగిపోయారు. శ్రీదేవి కూతురు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కానీ జాన్వీ పరిస్థితి వేరు .. శ్రీదేవి పట్ల గల అభిమానాన్ని కలుపుకునే ఆమెను చూస్తారు. ఈ పాన్ ఇండియా సినిమా తరువాత ఆమె బిజీ కావడం ఖాయం. అందువలన మిగతా స్టార్ హీరోలు కూడా తమ నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఆమెతో సంప్రదింపులు జరిపిస్తున్నారని తెలుస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version