సీఎం జగన్ కి జేసీ వార్నింగ్..!

-

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. జగన్ బెదిరింపులకు భయపడేవాడ్ని కాదని ఆయన అన్నారు. ఆయన బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. అలాగే జగన్ తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. తనను లక్ష్యంగా చేసుకునే తమ బస్సులు, లారీలను ఆపేశారని మండిపడ్డారు. తన వ్యాపారాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలనేది జగన్ ఆలోచన అని అన్నారు. ఇకపోతే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలను సృష్టించారనే కేసులో ప్రస్తుతం వీరిద్దరూ రిమాండ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version