విపక్ష నేతలు గుంట నక్కలు, ఊర కుక్కలు అంటూ జోగి రమేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

-

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది ఉండేది పక్కరాష్ట్రంలో విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ప్రజలపైనా అని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి జోగి రమేష్ తీరుపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని నేతలు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆయన మాటలకు అడ్డూఅదుపు లేకుండాపోవటం దీనికి కారణం అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు చేసే క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version