క‌రోనా గురించి లాల్‌ద‌ర్వాజా బోనాల జోగిని ముందే చెప్పిందా..? గ‌ండ దీపం మాటేమిటి..?

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు.. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాల‌ను వెలిగించాల‌ని.. ప్ర‌ధాని మోదీ చెప్పారు క‌దా.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పిలుపుకు దేశ‌వ్యాప్తంగా విశేష స్పంద‌న ల‌భిస్తోంది. మ‌రో రెండు గంట‌ల్లో ఆ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. అందులో భాగంగానే ప్ర‌జ‌లంద‌రూ దీపాల‌ను వెలిగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇక్క‌డే ఓ ఆసక్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. అదేమిటంటే…

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఏటా లాల్ ద‌ర్వాజ శ్రీ సింహ‌వాహిని అమ్మ‌వారి బోనాల ఉత్స‌వాల్లో రంగం కార్య‌క్ర‌మం ఉంటుంది క‌దా.. అందులో జోగిని స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణిని వినిపిస్తుంది. అయితే గ‌తంలో ఆమె భ‌విష్య‌వాణిని వినిపిస్తూ.. దేశంలో విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌తి ఇంటి నుంచి గండ దీపం రావాల‌ని, ఆ వెలుగులో ఎంత‌టి దుష్ట‌శ‌క్తిని అయినా అమ్మ‌వారు పార‌ద్రోలుతుంద‌ని.. చెప్పింది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌లంద‌రినీ దీపాలు వెలిగించ‌మ‌ని పిలుపునిచ్చారు.

జోగిని స్వ‌ర్ణ‌ల‌త అలా చెప్పిన భ‌విష్య‌వాణి వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీంతో ఆమె ప్ర‌స్తుత స్థితిని ముందే ఊహించి చెప్పింద‌ని అమ్మ‌వారి భ‌క్తులు అంటున్నారు. క‌నుక‌నే ప్ర‌తి ఒక్క‌రూ దీపాల‌ను వెలిగించాల‌ని వారు కోరుతున్నారు. ఏది ఏమైనా.. అప్పుడామె చెప్పిన భ‌విష్య‌వాణి ప్రకారం.. ఇప్పుడు దేశం నిజంగానే చాలా విప‌త్క‌ర ప‌రిస్థితిలో ఉంది.. దాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే.. అంద‌రూ దీపాలు వెలిగించండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version