కరోనాతో హైదరాబాద్ జర్నలిస్ట్‌ మృతి..!

-

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌ నగరంలో కరోనా బారిన పడి ఓ జర్నలిస్ట్‌ ప్రాణాలు విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న‌ జర్నలిస్ట్‌ మనోజ్‌.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషయమించటంతో ఆదివారం కన్ను మూశారు. మాదన్న పేటకు చెందిన మనోజ్‌ ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో క్రైం రిపోర్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మనోజ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version