జ‌ర్న‌లిస్టు దారుణ హ‌త్య‌

-

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. బల్లియా జిల్లా ఫెఫానాలో హిందీ న్యూస్ ఛానల్‌తో పనిచేస్తున్న జర్నలిస్టు రతన్ సింగ్ (45)ను సోమవారం రాత్రి దుండగలు కాల్చి చంపారు. ఆ గ్రామ పెద్ద జబర్ సింగ్ ఇంటి సమీపంలో ఘటన జరగడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రతన్‌సింగ్‌ కుటుంబానికి జబర్‌ సింగ్‌ కుటుంబానికి మ‌ధ్య వివాదాలున్నాయని బల్లియా ఎస్పీ దేవేంద్రనాథ్ తెలిపారు. మృతుడి తండ్రి వినోద్ సింగ్ సైతం జబర్ సింగ్ కుట్ర చేసి తన కుమారుడిని చంపించాడని ఆరోపిస్తున్నాడు.

 

అయితే.. సోమ‌వారం సాయంత్రం 5 గంటలకు జబర్ సింగ్ సోదరుడుకి రతన్‌ సింగ్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. మూడేళ్ల క్రితం తన పెద్ద కుమారుడిని సైతం వీరే చంపారని వినోద్ సింగ్ ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news