జూనియర్ ఆర్టిస్ట్ మృతిపై అనుమానాలు…!

-

ఎన్నో ఆశలు.. ఆశయాలతో సినిమా ఇండస్ట్రీలో రాణించాలని అనుకున్న యువతి అనుకోని ప్రమాదం వల్ల మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి అనే యువతి 26 సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అంతేకాకుండా సినిమాలు చేస్తూనే మరోవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అయితే ఇటీవల జ్యోతి రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లింది.

ఇక తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా కాచిగూడ స్టేషన్ అనుకుని షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. నిద్రమత్తులో రైలు దిగి మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేయగా కింద పడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే యువతి మరణించింది. ఇదిలా ఉంటే జ్యోతి రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు మరియు జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version