కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హైదరబాద్ కి బదిలీ

-

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు…  కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి రాజిందర్‌ కౌశిక్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22లోగా ఆయన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా  బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టులకు మరో ఐదుగురు జడ్జిల బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో హైకోర్టు విభజన జరగనున్న నేపథ్యంలో న్యాయమూర్తుల సంఖ్య పెరగడం హర్షించ దగ్గ విషయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version