గొర్రెల కాపరైన కేఏ పాల్..వీడియో వైరల్

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చాలా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రచారంలో ప్రజా శాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఎన్నడూ లేని విధంగా…. ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీని తాజాగా టార్గెట్‌ చేశారు కేఏ పాల్‌. డిగ్రీలు చేసిన యువత గొర్రెలు కాయాలా? అని కేఏ పాల్ మండి పడ్డారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకర్షిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్, మరోసారి తన స్టైల్ లో ప్రచారం చేశారు. ఈసారి గొర్రెల కాపరి వేషధారణలో కనిపించారు. గొర్రెల కాపరులు నరకం చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు చేసిన యువతకు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version