నయన్‌-విఘ్నేశ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజల అగర్వాల్‌

-

నయనతార, విఘ్నేశ్‌ అభిమానులకు తాము తల్లిదండ్రులైనట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ట్విన్స్‌ జన్మించినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు.. నయన్, విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లయిన సరిగ్గా నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులు అయ్యారు. అక్టోబర్ 9న సరోగసీ విధానంలో (వేరొకరి గర్భం సాయంతో) కవలలకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్ 9న చెన్నైలో నయన్, విఘ్నేశ్ వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లికి ముందే పిల్లలకు ప్లాన్ చేసుకోవడంపై వీరిని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే, కొందరు తల్లిదండ్రులైన ఈ జంటను శుభాకాంక్షలతో అభినందిస్తున్నారు. నటి కాజల్ అగర్వాల్ కూడా తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేసింది.

‘‘నయన్ మరియు వికీకి చాలా చాలా శుభాకాంక్షలు. పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానం. కచ్చితంగా జీవితంలో ఇది ఉత్తమ దశ అవుతుంది. ఉయిర్, ఉలగమ్ కు నా నుంచి ఎంతో ప్రేమ, దీవెనలు’’ అంటూ కాజల్ అగర్వాల్ పోస్ట్ పెట్టింది. నయన్, విఘ్నేశ్ 2015 నుంచి ప్రేమలో ఉన్నారు. డేటింగ్ తో మరింత దగ్గరై, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version