ఆమంచికి మరోసారి వార్నింగ్ ఇచ్చిన కరణం…!

-

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మరోసారి నియోజకవర్గ మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు వార్నింగ్ లు ఇచ్చారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం… జగన్ గాలిలోనే ప్రజలు చీరాలలో టీడీపీ అభ్యర్థిని మెజారిటీతో గెలిపించారంటే అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు పనుల కోసం వచ్చే వారితో మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఓట్లు వేయలేదని కొంత మందిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. లా అండ్ అర్డర్ విషయంలో చీరాల ప్రజలు భయపడాల్సిన పని లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో వచ్చి ఇబ్బందులు పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version