నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. కన్నడ కస్తూరిని ఎవరి దక్కించుకుంటారో మరి కొన్ని గంటల్లో తేలనుంది. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల కౌంటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం కర్ణాటక అధికారం చేతులు మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూ బీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? లేదా ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు నిజమవుతాయా? వీటిన్నంటికి సమాధానాలు మరికొద్ది గంటల్లో తెలియనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు​ జరగనుంది. మధ్యాహ్నం నాటికి కన్నడ నాట ఫలితం.. స్పష్టంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version