కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఆనంద్ రావులు కార్తీక్ వాళ్ల గురించి బాధపడతూ ఉండగా..మోనిత స్కూటీతో ఇంట్లోకి వచ్చి కార్తీక్ ఎక్కడున్నావ్, మన బాబును ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ హాల్ లో రౌండ్స్ వేస్తుంది. సౌందర్యవాళ్లు పైనుంచి చూస్తారు. కిందకు వస్తారు. మోనిత మీ కొడుకు మీకు దూరమయ్యాడని, నా కొడుకుని దూరం చేస్తారా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అంటే..నా బాబుని ఎవరో ఎత్తుకెళ్లారు పిలవండి ఆదిత్య ఎక్కడున్నాడు అంటే..బయటకు వెళ్లాడు అంటే..నాకు తెలుసు నా కొడుకును ఆదిత్యే ఎత్తుకెళ్లాడు అంటుంది మోనిత. ఎత్తుకెళ్లడం, దాచిపెట్టడం నీకు అలవాటు మాకు కాదు అంటుంది సౌందర్య. అయినా ఈ మెంటల్ది ఆదిత్యే నా కొడుకుని ఎత్తుకెళ్లి ఉంటాడు, ఇదంతా మీ ప్లాన్ యే అయిఉంటుంది..నా కొడుకుని ఎత్తుకెళ్తే ఏడుస్తా అని అనుకుంటున్నారా..నెవర్. నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారో తెలిసేవరకూ నేను ఇక్కడ నుంచి కదలను, ఇక్కడే ఉంటాను అంటుంది.
ఆరోజు రాత్రి కార్తీక్ వాళ్లు కింద కుర్చోని భోజనం చేస్తుంటారు. కార్తీక్ గతంలో అందరూ డైనింగ్ టేబుల్ మీద కుర్చోని తినే సీన్ తలుచుకుంటాడు. ఇంతలో రుద్రాణి వస్తుంది. ఇల్లు సౌకర్యంగా ఉందామ్మా అంటుంది. రండిరండి ఇలా వచ్చారేంటి, కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదండి అంటుంది దీప. వచ్చేలా చేశావ్ మరి నేను ఏం చేయను అని ఇల్లాంతా చూస్తుంది. టైం బాలేక వచ్చాను అన్నావ్..వంటసామాగ్రి చాలానే ఉన్నాయి నీవేనా అంటే..బయటవాళ్ల వస్తువులు ఉన్నాయని నేనే తీసుకువచ్చాను అండి అని కార్తీక్ అంటాడు. ఆ మాట నాకు చెప్పాలికదా..ిది రుద్రాణి సామ్రాజ్యం అని తెలుసుకదా అంటుంది. నేనే వచ్చి మీకు చెప్పాలి అనుకున్నాను అండి అంటుంది దీప. రుద్రాణి కోపంతో అన్నం గిన్నెను కాలుతో తన్నుతుంది. కార్తీక్ కోపంగా…మీరేం మనుషులండి..పిల్లలు తింటున్నారు అని తెలిసి కూడా కాలుతో తంతారా అంటే..నా మాట వినకపోతే నేను అంతే..గిన్నెలు అయినా మనుషులైనా కాలితోనే సమాధానం చెప్తాను అంటుంది. రుద్రాణి సమ్రాజ్యం ఇది అంటుంది. కార్తీక్ ఏం మనుషులండి అని చేయి చూపిస్తాడు. రుద్రాణి కార్తీక్ ను నెడుతుంది. అంతే. దీప జెట్ స్పీడ్ లో వచ్చి రుద్రాణి చెంప పగలకొడుతుంది. మర్యాద మర్యాద నేర్చుకోండి, ఆయన ఎవరు అనుకుంటున్నారు, మీ లాంటి వాళ్లు వందమంది చేతులెత్తి మొక్కుతారు తెలుసా అంటుంది. దీప ఆగు అంటే..మీరు ఆగండి చెప్పనివ్వండి, నన్ను ఏమన్నా ఊరుకుంటాను కానీ. మిమ్మల్ని ఏమైనా అంటే ఊరుకోను అంటుంది. అంత గొప్పోడా..అలాంటప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చినట్లో అంటుంది రుద్రాణి. అదినీకు అనవసరం అంటుంది దీప. ఇంత గొప్పగా చెప్తున్నావ్ అంటే..ఏదో పెద్దకథే ఉందనమాట..నేను బియ్యం ఇస్తాను అంటే..నువ్వు వద్దన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటుంది రుద్రాణి.
తరువాయభాగంలో శ్రీవల్లి వాళ్లు బిడ్డను తీసుకుని ఇంటికి వస్తారు. దీప హారతి ఇచ్చి ఇంట్లోకి పిలుస్తుంది. కార్తీక్ చూసి రోజుల బిడ్డలా లేడే అంటే..దీప కూడా నాకూ అదే అనిపించింది..కోటేష్ నిజం చెప్పు ఈ బిడ్డ ఎవరిది అంటుంది. మరోసీన్ లో మోనిత కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు..పుట్టెడు దుఖంలో ఉన్నాను, నాకు మీరే న్యాయం చేయాలి అంటుంది. తిరిగితిరిగి మోనిత కోడుకు కార్తీక్ వాళ్ల దగ్గరకు చేరటం మాత్రం సూపర్ ట్విస్ట్.