భట్టి కి ఎన్నికలు హామీలను గుర్తు చేసిన కవిత..!

-

తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కవిత లేఖ రాసారు. బీసీ సంక్షేమం కోసం 20000 కోట్లు కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని ఆమె గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని కల్వకుంట్ల కవిత లేఖలో రాశారు. ప్రతి జిల్లా కేంద్రం లో 50 కోట్ల వ్యయం తో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలని నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఆమె గుర్తు చేశారు. బడ్జెట్లో బిసి సంక్షేమాల కోసం 20,000 కోట్లు కేటాయించాలని ఆమె కోరారు. ఈ నిధులు కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు అవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version