కాంగ్రెస్ మా ఫ్లెక్సీలని, బ్యానర్లను తీసేస్తోంది: KCR

-

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ అయితే ఫిక్స్ అయిపోయింది. బస్ యాత్రకు సంబంధించి శుక్రవారం రాత్రి ఎన్నికల కమిషన్ దగ్గర బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి అనుమతి తీసుకున్నారు. ఈనెల 22 నుండి మే 10 దాకా కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.

ఎన్నికల సందర్భంగా అధికారులు అందరూ ఈసీ పరిధిలోకి వస్తారు కనుక యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తల మీద సోషల్ మీడియా వారియర్స్ మీద దాడులు చేస్తూ మేము కడుతున్న ఫ్లెక్సీలని బ్యానర్లని తొలగిస్తుందని దీనిపై దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేశారు ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version