మహబూబాబాద్‌లో BRS కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ మహబూబాబాద్​కు చేరుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముందుగా కేసీఆర్ మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు.

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం పాలనాసౌధం ఆవరణలో నిర్మించిన ప్రజాగ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో ప్రసంగించనున్నారు. అనంతరం, కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం సీఎం హెలిక్యాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version