ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ..!

-

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ కు కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు మరోవైపు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ సర్కార్ ఎంక్వయిరీలతో గులాబీ పార్టీ సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీ తిరిగి పుంజుకోవడం అంత సులువైన పనేమి కాదనే చర్చ జరుగుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

హరీశ్ రావు నేతలను ఫామ్ హౌస్ తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. తాజా రాజకీయ పరిస్థితితులు, వలసలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అయితే వారం రోజుల పాటు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్యనేతలతో గులాబీ బాస్ సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version