కెసిఆర్ కాపలా కుక్కలా ఉంటానని మాట తప్పాడు: డీకే అరుణ

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్ అడుగడుగున మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాట ఇచ్చాడని, కానీ ఇప్పుడా హామీని తుంగలో తొక్కి వేశాడు అని ఆమె విమర్శించారు.

బిజెపి మద్దతు ఇవ్వకుంటే అసలు తెలంగాణ ఏర్పాటు అయ్యే కాదన్నారు. అమరుల త్యాగాల మీద కేసీఆర్ గద్దెనెక్కాడు అని ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు అన్నారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు అని నిలదీశారు. భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని ఆగ్రహించారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version