టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్…టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన !

-

టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది. టీచర్ల బదిలీలతో మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉంటే, బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని ప్రకటించారు.

కొత్త టీచర్లు వచ్చే వరకు వారు అక్కడే కొనసాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ టీచర్ లేని పాఠశాల ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో పదివేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. మండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version