TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. సిట్ పై కోర్టును ఆశ్రయించిన ఈడి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సిట్ పై నాంపల్లి కోర్టును ఆశ్రయించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). అవసరమైన పత్రాలు ఇవ్వాలంటూ ఇటీవల సిట్ కి ఈడి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే సిట్ తమకు ఎలాంటి సమాధానం ఇవ్వడంలేదని ఈడి నాంపల్లి కోర్టుని ఆశ్రయించింది. అయితే హైకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక ఇచ్చిన తర్వాత ఈడికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని సిట్ కౌంటర్ దాఖలు చేసింది.

దీంతో లీకేజీ పై విచారణ కాస్తా పక్కదారి పట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ కు, కేంద్రానికి చెందిన ఈడి కి మధ్య వివాదానికి దారితీసింది. ఇక పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే ఈడి వివరాలు సేకరించింది. ఈసీఐఆర్ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. టీఎస్పీఎస్సీ నిందితుల వద్ద నుండి సిట్ ఏడు లక్షలు సేకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version