khairatabad ganesh 2025: ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ప్రారంభం అయింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే సంప్రదాయ మేళతాళాలతో ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ముందుగా గణేశునికి ఉత్సవ కమిటీ భారీ గజమాలను వేసింది.

ఇటు గణేశుని చుట్టూ పోలీసులు రోప్ వేను ఏర్పాటు చేశారు. టెలీఫోన్ భవన్, సెక్రెటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు గణేశుని తరలించనున్నారు. నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు.
- సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభం
- ఉత్సవ కమిటీ నుంచి గణేశునికి భారీ గజమాల సమర్పణ
- భద్రతా దృష్ట్యా గణేశుని చుట్టూ పోలీసుల రోప్ వే ఏర్పాటు
- టెలిఫోన్ భవన్ – సెక్రెటేరియట్ – ట్యాంక్ బండ్ మార్గంలో తరలింపు
- నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం నిర్వహణ
- భక్తుల నినాదాలతో ఉత్సాహభరితంగా శోభాయాత్ర