మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది : ఖుష్బూ

-

కాంగ్రెస్‌ నేత, సినీ నటి ఖుష్బూ ఆ పార్టీకి హ్యాండిచ్చి కాషాయ గూటికి చేరతారని ప్రచారం నిన్నటి నుండి జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌ లో ఆమె అక్కడ బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరారు. తమిళ కాంగ్రెస్ లో కీలక పదవిలో ఉన్న ఖుష్బూ బీజేపీలో చేరడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయని చెప్పచ్చు.

మోడీ సరైన దిశలోనే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రధాని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరానని అన్నారు ఖుష్బూ. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఖుష్బూ.. చివరకు హస్తం పార్టీని విడిచిపెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా పాలసీని సమర్థించిన ఖుష్బూ మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వ కారణమని అన్నారు. ఇక త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఖుష్భూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version