గర్ల్ ఫ్రెండ్ ని బ్లాక్ మెయిల్ చేసాడని చంపేసాడు…!

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను బ్లాక్ మెయిల్ చేసిన 32 ఏళ్ల వ్యక్తిని ఆమె స్నేహితుడు హత్య చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని నెహ్తౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్కోలి గ్రామానికి సమీపంలో ఉన్న చెరకు పొలంలో ఈ హత్య జరిగింది. మరణించిన వ్యక్తిని అభిషేక్ కుమార్ గా గుర్తించారు. షేక్పూర్ గ్రామ నివాసి అని పోలీసులు వివరించారు.

అతని తండ్రి రతన్ సింగ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహందబాద్ గ్రామ నివాసి దీపక్ సైని మరియు అతని స్నేహితుడు అంకిత్ కుమార్ గొంతు కోసి చంపారు అని పోలీసులు పేర్కొన్నారు. అభిషేక్ తాను ప్రేమించిన అమ్మాయితో దీపక్ కలిసి ఉన్న సమయంలో ఫోటోలను తీసాడు. ఆ తర్వాత ఫోటోలను ఉపయోగించి, అమ్మాయిని ఒంటరిగా తనను కలవాలి అని బ్లాక్ మెయిల్ చేసాడు. దీనితో దీపక్ తన ఫ్రెండ్ తో కలిసి హత్య చేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version