FLASH : బయోకాన్ చీఫ్ కి కరోనా..!

-

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. దేశంలోని ప్రముఖ మహిళల్లో ఒకరైన బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమెనే ట్వీట్ ద్వారా తెలిపారు.

కరోనా కేసుల్లో తాను కూడా చేరాననీ, తనకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయనీ.. త్వరలోనే కరోనా తనను వదిలేస్తుందనే ఆశతో ఉన్నానని ఆమె ట్వీట్ ద్వారా చెప్పారు. ఇకపోతే బెంగళూరులో కేవలం రూ.10 వేలతో ఫార్మా కంపెనీ ప్రారంభించి వేలాది కోట్ల సంస్థగా మలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మజుందార్ షా ఈ మధ్య రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌‌పై పలు ప్రశ్నలు సంధించిన విషయం అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version